కవితకు రేవంత్ కీలక పదవి? | Congress Key Post To Kavitha?| CM Revanth Reddy | KCR | Telangana | RTV
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు దానం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణంగా మారిందన్నారు. మూటల ముఖ్యమంత్రిగా మారిన రేవంత్.. హెరాల్డ్ కేసుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జూన్ 2న పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రతీ శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించి సమన్వయంతో పని చేయాలన్నారు. ఏర్పాట్లపై ఈ రోజు సీఎస్ సమీక్షించారు.
'రాజీవ్ యువవికాసం పథకం' అమలులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో మొదట 5లక్షల మందికి జూన్ 2న రూ.4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు మంజూరు చేశారు. దీనికోసం రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నారు.
ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు చెప్పారు.
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70% వాటా వచ్చేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదించాలని సూచించారు. కృష్ణా బేసిన్లో 70% తెలంగాణలో, 30% మాత్రమే ఏపీలో ఉందన్నారు.
క్యాన్సర్ బాధిత కుటుంబాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ చికిత్సకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చికిత్స అనంతరం సాయి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించారు.అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.