BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీకు కొత్త రేషన్ కార్డు మంజూరైందా? లేదా? ఇలా తెలుసుకోండి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డెమాస్కస్లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాడులకు ప్రతి దాడులు తప్పవని సిరియా హెచ్చరించింది.
ఇటీవలే విడుదలైన 'డ్రాగన్' సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
విజయవాడ గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులను రౌడీ షీటర్ కిషోర్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు.
ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్థాపానికి గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.
అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.