/rtv/media/media_files/2026/01/23/pm-modi-2026-01-23-17-54-17.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన.. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయం(Sabarimala Temple)లో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. కేరళలో బీజేపీ(bjp) అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, దోషులను జైలుకు పంపుతామన్నారు. ఇది మోదీ గ్యారెంటీ అని ఆయన చెప్పుకొచ్చారు.
🚨‘Culprits Will Be Jailed’: PM Modi’s Sabarimala Promise Raises Political Heat in Kerala 🔥
— Not Just Headlines (@Notjustheadline) January 23, 2026
Prime Minister Narendra Modi on Thursday made a strong political and moral pitch in Kerala, promising strict action in the Sabarimala gold theft controversy. Addressing a public… pic.twitter.com/qoVTVTP8go
Also Read : ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన కీలక మావోయిస్టులు.. ఒక్కొక్కరిపై
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై
కేరళను ఇన్నాళ్లు పాలించిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై ప్రధాని విరుచుకుపడ్డారు. దేశం మొత్తానికి అయ్యప్ప స్వామిపై విశ్వాసం ఉంది. కానీ ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమల సంప్రదాయాలను దెబ్బతీయడానికి ఏ అవకాశాన్ని వదల్లేదని మోదీ విమర్శించారు. కేరళ భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం NDA కూటమికే ఉందని, ఇది అభివృద్ధి, సుపరిపాలనకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేరళలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మరియు కొత్త రైలు సర్వీసులను కూడా ప్రారంభించారు.
केरल के तिरुवनंतपुरम में एक सार्वजनिक कार्यक्रम के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी के संस्कार और सादगी का एक ऐसा दृश्य देखने को मिला जिसने वहां मौजूद हर व्यक्ति का दिल जीत लिया। मंच पर जब एक महिला कार्यकर्ता ने सम्मान स्वरूप प्रधानमंत्री के चरण स्पर्श करने की कोशिश की, तो पीएम… pic.twitter.com/B6dNT6ideu
— KHABAR FAST (@Khabarfast) January 23, 2026
కాగా శబరిమల ఆలయ గర్భాలయ ద్వారాలకు, ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన బంగారు రేకులు మాయమయ్యాయనే ఆరోపణలు కేరళలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది.
Also Read : జైల్లో ఖైదీల మధ్య పుట్టిన ప్రేమ..పెళ్లికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Follow Us