Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.
కరోనా కేసుల పెరుగుదలే ఆందోళనకరమంటే ముంబైలో కరోనా సోకిన ఇద్దరు తాజాగా మృతి చెందడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14ఏళ్ల బాలుడు, 54ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందారు.
కేరళలో రేబిస్ వ్యాధి కలకలం రేపుతోంది. కేరళకు చెందిన ఏడేళ్ల బాలిక యాంటీ-రేబిస్ టీకాలు తీసుకున్నప్పటికీ రేబిస్ ఇన్ఫెక్షన్కు గురై చనిపోయింది. ఇది ఈ నెలలోనే మూడో కేసు కావడం గమనార్హం.
దేశ తొలిపౌరురాలు ద్రౌపది ముర్ము శబరిమలను సందర్శించనున్నారు. ముర్ము రెండు రోజుల పాటు కేరళ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు సోమవారం పర్యటన వివరాలను వెల్లడించాయి.
వరకట్నం కోసం 28 ఏళ్ల మహిళను ఆకలితో చంపిన కేసులో ఆమె భర్త, అత్తకి కొల్లం కోర్టు జీవిత ఖైదు విధించింది. తుషార హత్య కేసులో దోషులుగా తేలిన చందూలాల్ (36), గీతా లాలి (62) లకు కొల్లం అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధించారు.
కేరళలోని తిరవనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలెర్ట్ అయిన ఎయిర్పోర్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అన్ని టెర్మినల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి ఎలాంటి బాంబు లేదని గుర్తించారు.
కేరళలో మరో భయంకరమైన మర్డర్ జరిగింది. వయనాడ్లో జిల్సన్ అనే వ్యక్తి తన భార్య లీషాను ఛార్జింగ్ కేబుల్తో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తమ ఇద్దరు పిల్లలను ఒక గదిలో బంధించి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని ట్రావెన్కోర్ దేవస్థానం ప్రారంభించింది. అయితే ఈ బంగారు లాకెట్లను WWW.Sabarimalaonline.org వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నగదు చెల్లింపును అక్కడికి వెళ్లి చూపిస్తే గోల్డెన్ లాకెట్ అందజేస్తారు.
కరోనా పేషెంట్పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు జైలుశిక్ష విధిస్తూ కేరళలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కాయంకుళంకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ను దోషిగా తేల్చింది.