Telangana: కేసీఆర్పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు.
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు.
తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ఇంట్లో ACB రైడ్స్ నిర్వహించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
తాను హరీశ్ రావుని కలిశాని వస్తున్న వార్తలను MP ఈటల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే హరీశ్ రావుని కలిశానని ఆయన అన్నారు. BJPయే తెలంగాణకు దిక్సూచి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన 3 తరాల ఉద్యమంలో అమరులను స్మరించుకున్నారు.
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరదించి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభత్వం భావిస్తోంది. దానికోసం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఎ.బి.పాండ్య ఛైర్మన్గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
BJP అంటేనే బూతు జనతా పార్టీ అని.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BJPని ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అని ధ్వజమెత్తారు. తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో KCR నిజాయితీ నిరూపించుకుంటే పూలదండలు వేస్తామన్నారు.