Eatala Rajendar : ముగిసిన ఈటల రాజేందర్ విచారణ... ఆయన ఏం చెప్పారంటే...

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ఓపెన్‌ కోర్టులో ఈటలను కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.

New Update
Eatala Rajendar

Eatala Rajendar Photograph: (Eatala Rajendar)

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. ఓపెన్‌ కోర్టులో ఈటలను కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఈటలపై కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆయనను విచారణకు పిలిచింది. కమిషన్‌ ముందు 113వ సాక్షిగా ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. తొలుత.. ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్‌తో అంతా నిజమే చెప్తానని కమిషన్‌ ప్రమాణం చేయించింది. ఈ సందర్బంగా ఈటలకు 24 ప్రశ్నలు వేసింది.

కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించిన కమిషన్‌కు టెక్నికల్‌టీమ్‌ రిపొర్టుల ఆధారంగా సబ్‌కమిటీ నివేదిక ప్రకారం క్యాబినెట్‌నిర్ణయం తీసుకుందని ఈటల సమాధానం చెప్పారు.కాగా కమిషన్‌ అడిగిన ప్రశ్నలకు తనవద్ద ఉన్న ఆధారాలను చూపుతూ సమాధానం చెప్పారు.  కాగా మొదట 63 వేల కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు ఆ తర్వాత 83 కోట్లకు చేరిందన్న రాజేందర్‌ చివరిదశలో ఎంత ఖర్చయిందో తనకు తెలియదని స్పష్టం చేశారు.

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Etala Rajender

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదన్న ఈటలDPR కోసం వ్యాప్కోస్ సంస్థకి 595 కోట్లు విడుదల చేసినట్లు నాకు తెలియదని సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ను నియమించారు. ప్రాజెక్ట్ నిధుల సేకరణ, ఖర్చు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసింది. ఎవరికి నిధులు విడుదల చేశారు అనేది వారి పరిధిలో జరిగిందని స్పష్టం చేశారు.బడ్జెట్ ఎలకిషన్ మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యతని తెలిపారు. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు?: అని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని ఈటల వివరించారు.

Also Read: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం

తుమ్మిడిహేట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించామన్నారు. మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. తర్వాతే నిర్మాణం జరిగిందని తెలిపారు. రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు అన్న కమిషన్‌ ప్రశ్నకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారన్నారు. హరీష్ రావు చైర్మన్‌గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నామని ఈటల తెలిపారు. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగిందని స్పష్టం చేశారు.రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా?అన్న ప్రశ్నకు చెసిందని ఈట సమాధానం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఏపీలో తల్లి కొడుకు మృతి వెనుక ఉన్న ఘోర నిజాలు 
కాగా అంతకు ముందు ఈటల మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బు కేటాయించడం మాత్రమే తన పని అని స్పష్టం చేశారు. నోటీసులు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదా అంటూ కమిషన్‌ను ఆయన తప్పుబట్టారు. కాళేశ్వరం విచారణ వెనుక నిజాయితీ, చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదని కామెంట్ చేశారు. కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే తనకు నోటీసులు ఎలా ఇస్తారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 

kcr | minister-thummala-nageswara-rao | kaleshwaram | eatala-rajendar | harishrao | kaleshwaram barrage | kaleshwaram case updates | kaleshwaram case | Kaleshwaram Commission

Advertisment
Advertisment
తాజా కథనాలు