జమిలి ఎన్నికల బిల్లు.. విప్ జారీ చేసినా 20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా
మంగళవారం కేంద్రం లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టగా.. దాదాపు 20 బీజేపీ ఎంపీలు ఈ సభకు డుమ్మా కొట్టారు. ఎంపీలందరూ రావాలని విప్ జారీ చేసినప్పటికీ ఇలా పలువురు రాకపోవడంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రానివారందరికీ నోటీసులు పంపించనుంది.