🔴Live News Updates: ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇండిగో విమానాల్లో కూడా వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం మరో ఇండిగో విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది.
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్పూర్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దారి సరిగా కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని మరోసారి గాల్లోకి తీసుకెళ్లారు. 15 నిమిషాల పాటు గాల్లోనే తిప్పి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఢిల్లీ నుంచి రాయ్పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
ముంబైలోని సహార్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమై అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయ హాట్లైన్కు ఫోన్ కాల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది.
UP వారణాసి ఎయిర్పోర్టులోని ఇండిగో విమానంలో ఓ విదేశీయుడి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. బెంగళూరు వెళ్తున్న విమానంలో కెనడా వ్యక్తి తన బ్యాగ్లో బాంబు ఉందంటూ హల్చల్ చేశాడు. సెక్యురిటీ సిబ్బంది చెక్ చేయగా బాంబ్ దొరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.