Hanuman Jayanti 2025: రేపు హనుమాన్ శోభాయాత్ర...ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రలో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొననున్నారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.