Saddula Bathukamma : రేపు హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ...ఆ రూట్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలో రేపు సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికోసం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు  అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌, నెక్లెన్‌రోడ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

New Update
Saddula Bathukamma in Hyderabad

Saddula Bathukamma in Hyderabad

Saddula Bathukamma : హైదరాబాద్‌ నగరంలో రేపు (మంగళవారం, సెప్టెంబర్‌ 30వ తేదీ) సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికోసం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు  అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌, నెక్లెన్‌రోడ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌లోని అమరవీరుల స్మారక స్థూపం నుండి బతుకమ్మ ఘాట్" (రోటరీ చిల్డ్రన్స్ పార్క్) వరకు అప్పర్ ట్యాంక్ బండ్ పైన సద్దుల బతుకమ్మ వేడుకులను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కనుక వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది.

 ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో  రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను  రాత్రి 11 గంటల వరకు అనుమతించరు. ఇక ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగు తల్లీ ఫ్లైఓవర్  ప్రారంభం నుంచే  కట్ట మైసమ్మ, డా. బీఆర్‌ అంబేద్కర్‌, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ మీదుగా మళ్లించనున్నారు.  పీవీ  విగ్రహం నుండి ఎన్టీఆర్‌ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్స్ హైమాక్స్‌,  మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు. అదే సమయంలో నల్లకుంట జంక్షన్ నుండి బుద్ధ భవన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.  అటు నుంచి వచ్చే వారిని నల్లకుంట X-క్రాస్ రోడ్‌,  రాణిగంజ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తారు.
 
ఇక లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ 'యు'  టర్న్‌ నుంచి తెలుగు తల్లీ జంక్షన్ నుంచి తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్- కవాడిగూడ - గాంధీ నగర్ టి జంక్షన్- గోశాల- ధోభి ఘాట్- స్విమ్మింగ్ పూల్- బండ మైసమ్మ- ఇందిరా పార్క్- కట్ట మైసమ్మ,  తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.
 
వాహనదారులతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా మళ్లించనున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్‌ వైపు  వచ్చే అన్ని అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకార్-ఉపాకర్ జంక్షన్ వద్ద YWCA-సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట-ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్, -బర్కత్‌పురా, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్-రంగమహల్ మీదుగా ఎంజీబీఎస్‌ వైపు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని,  అందువల్ల జంక్షన్‌ల వైపు ప్రజలు రాకుండా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.  సాధారణంగా రోజూ ఈ మార్గాల్లో వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా వారి వారి ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుని తమకు సహకరించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం కోరింది.

ఇక సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. స్నో వరల్డ్‌,  ఎన్టీఆర్‌ స్టేడియం, రేస్‌ కోర్స్‌ రోడ్‌, బీఆర్‌కే భవన్‌ రోడ్‌, హెచ్‌ఎమ్‌డీఏ పార్కింగ్‌,సంజీవయ్య పార్క్‌,  లుంబినీ పార్క్ ఎదురుగా తమ వాహనాలను నిలుపుకోవాలని పోలీసులు సూచించారు.

ఇది కూడా చదవండి: డివైడర్ దాటి టెంపో పైకి దూసుకెళ్లిన మరో టెంపో! ఘోరమైన యాక్సిడెంట్

Advertisment
తాజా కథనాలు