హైదరాబాద్లో ట్రాఫిక్కు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రైజింగ్ హైదరాబాద్ అనే స్కీమ్తో ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రాక్చర్ పేరుతో సిటీలో 38 పనులు 7 ప్యాకేజీల్లో పూర్తి చేయడానికి జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 8 స్టీల్ బ్రిడ్జ్లు, 6 అండర్ పాస్లు నిర్మించనున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
త్వరలోనే పనులు అన్ని ప్రారంభం..
వీటిని మొదట రూ.826 కోట్లతో నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ ఫ్లైఓవర్లు స్టీల్తో నిర్మించడంతో అంచనా వ్యయం రూ.1090 కోట్లకు పెరిగింది. అధికారులు ఇప్పటికే ఈ పనులు పూర్తి చేశారు. ఇంకో పది రోజుల్లో అండర్పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తారు. ఆ తర్వాత వెంటనే అన్ని పనులు స్టార్ట్ చేయనున్నారు.
ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్..!
కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లలో ఆరు అండర్ పాస్లు, 8 ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. వీటి దగ్గర రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రోడ్ నెంబర్45, ఫిలింనగర్, మహారాజ్అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జ్లు రానున్నాయి.
ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు..
అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ ఒకటి, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ 36 వైపు ఓ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే రోడ్లను కూడా మరో 20 అడుగులు పెంచనున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన