హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు | Hyderabad metro transports Heart from LB nagar to Lakdikapul |RTV
హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జేబీఎస్ టూ శామీర్పేట్, ప్యారడైజ్ టూ మేడ్చల్ రెండు మెట్రో కారిడార్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పొడిగించనున్నారు. డిసెంబర్ 31న మంగళవారం అర్థరాత్రి 12.30 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్ బయలుదేరుతుంది. జనవరి 1న 1.15 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
హైదరాబాద్ మెట్రోలో ఓ యువజంట రెచ్చిపోయింది. చైతన్యపురి నుంచి ఎల్బీనగర్ వెళ్లిన ఈ ప్రేమజంట ట్రైన్లో అందరిముందే ముద్దుల్లో మనిగిపోయింది. ఒకరినొకరు కౌగిలించుకుని అసభ్యకరంగా తాకిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
హైదరాబాద్ మెట్రో కోచ్ ల పెంపు కలగానే మిగిలింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గతేడాది మరో 3 కోచ్ లు పెంచుతామని చెప్పి, ఇప్పుడు అసాధ్యం అంటూ మెట్రో యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నాగోల్ - మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ విషయంలో ఎల్ అండ్ టీ గత కొద్ది నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చింది. నేటి నుంచి ఈ పెయిడ్ పార్కింగ్ను అమలు చేయనుంది. ప్రస్తుతం పార్కింగ్ ఏరియాల్లో ఛార్జీల బోర్డులు ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్షాక్ ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి ఇకపై అన్ని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూల్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యం కోసమే ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ వంటి ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి 31 వరకు ఈ ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది.