/rtv/media/media_files/2025/05/02/EzQW3TIlGiwHMS2saRXf.jpg)
Hyderabad Metro
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ టికెట్ ధరలపై(Metro Charges) ఎలాంటి మార్పులు జరగకపోవడంతో, ధరలు పెరగడం ఇప్పుడు తథ్యంగా మారింది. మెట్రో ప్రారంభించినప్పుడు రూ.10 నుంచి రూ.60 వరకు ఉన్న టికెట్ ధరలు గత ఏడున్నర సంవత్సరాలుగా అలాగే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు, మెట్రో నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ (LTMRH) సంస్థ ఈ ధరలపై పునఃపరిశీలనకు సిద్ధమవుతోంది.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్లో టెన్షన్ టెన్షన్..!
రూ.6,598 కోట్ల నష్టం..
సంస్థ సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, ధరల పెంపు అనివార్యం అంటూ చెప్పుకొచ్చారు. “నిర్వహణ ఖర్చులు గత కొద్ది సంవత్సరాల్లో 160 శాతం పెరిగాయి. మొత్తం నష్టాలు రూ.6,598 కోట్లు దాటిపోయాయి. తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో ఒత్తిడి మరింత పెరిగింది,” అని తెలిపారు.
అందునే సంస్థకు ఇప్పుడు టికెట్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 2023లో చేసిన సిఫార్సులను కూడా సంస్థ చేతిలో పెట్టుకుంది.
ప్రస్తుతం రద్దీ సమయాల్లో మెట్రో సేవలను మరింత మెరుగుపరచాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, సంస్థకు కావాల్సిన కొత్త ట్రైన్ల కొరత ఉంది. నాగపూర్ వంటి ఇతర మెట్రో సంస్థల నుంచి లీజ్ తీసుకోవాలన్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అందుకే స్వదేశీ తయారీదారుల మీద ద్రుష్టి పెట్టి, మూడు కోచ్లతో కూడిన 10 ట్రైన్ సెట్ల కొనుగోలుకు ముందడుగు వేసింది. ఇందులో మొదటి దశలో ఐదు ట్రైన్ సెట్ల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఖర్చు రూ.400 నుండి రూ.450 కోట్ల మధ్యగా ఉంటుంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఈ కొత్త ట్రైన్ సెట్లు ప్రస్తుతం ఉన్న 57 ట్రైన్ సెట్లతో కలిసి 69.2 కి.మీ పరిధిలో ఉన్న మూడు కారిడార్లలో తిరుగుతాయి. వాటిని పూర్తి స్థాయిలో సేవలలోకి తీసుకురావడానికి ఒప్పందం కుదిరిన తర్వాత పని పూర్తవ్వడానికి కనీసం 15 నెలల సమయం పడుతుంది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ను ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారంగా నిర్మించగా, ఇప్పటివరకు ఎల్అండ్టీ సంస్థ దాదాపు రూ.21,000 కోట్లు వెచ్చించింది. రోజుకు 7 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు జరిగితే మాత్రమే 2033 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందని ఎండీ పేర్కొన్నారు. ప్రస్తుతం, వీకెండ్స్లో రోజుకు 3.5 లక్షలు, మాములు వారాలలో 4.75 లక్షల ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు. అందువల్ల ఈ చార్జీల పెంపుతో కొంత వరకు నష్టాలను ఎదుర్కోవచ్చని సంస్థ ఎండీ అభిప్రాయపడ్డారు.