Hyderabad Metro: హైదరాబాద్ లో ఆగిపోయిన మెట్రో రైళ్లు..!

హైదరాబాద్ లో మెట్రో రైళ్ల రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది. రాత్రి కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలుల కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఖైరతాబాద్- ఎఖైరతాబాద్- ఎర్రమంజిల్ మధ్యలో రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి. 

New Update
Hyderabad metro

Hyderabad metro

Hyderabad Metro: నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులు, భారీ వర్షాలతో మెట్రో విద్యుత్ తీగలపై సమీప భవనం పై ఉన్న ఇనుప వస్తువులు పడడంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఖైరతాబాద్, ఇర్రమంజిల్ మధ్య రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి.  మెట్రో సేవలు నిలిచిపోవడంతో  ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు మెట్రో సిబ్బంది మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడినందుకు చింతిస్తున్నాము..  తిరిగి పునరుద్దించడానికి కృషి చేస్తున్నాము అని తెలిపింది.  రాత్రి హైదరాబాద్ లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. 

Also Read: 2025 Met Gala: మెట్ గాలా ఈవెంట్ లో తళుక్కుమన్న తారలు .. అబ్బురపరిచే ఫ్యాషన్ స్టైల్స్.. ఫొటోలు ఇక్కడ చూడండి

మెట్రో ధరలు పెంపు 

ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా మెట్రో రైలు టికెట్ ధరలను పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెట్రో నష్టాలను నివారించేందుకు ఎల్ అండ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై మే 8 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత మే 10 నుంచి పెంచిన టికెట్ ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

hyderabad metro latest news | latest-news

Also Read: Hyderabad Metro Fare Hike: ప్రయాణికులకు బిగ్ షాక్.. మెట్రో చార్జీల పెంపు- కొత్త ధరలు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు