Hyderabad Metro Fare Hike: ప్రయాణికులకు బిగ్ షాక్.. మెట్రో చార్జీల పెంపు- కొత్త ధరలు ఇవే!

హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగలనుంది. మెట్రో రైలు టికెట్‌ ఛార్జీల పెంపు త్వరలో అమలు కానుంది. 25-30% పెంపు కోసం ఎల్ అండ్ టీ అధికారులు ఈ నెల 8న సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ కాబోతున్నారు. దీంతో పెంచిన ఛార్జీలు 10 నుంచి అమలులోకి వస్తాయి.

New Update
Hyderabad Metro Fare Hike

Hyderabad Metro Fare Hike

హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్ టికెట్ ఛార్జీల పెంపుపై గత కొంతకాలంగా  వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఎల్‌ అండ్‌ టీ అధికారులు మెట్రో నష్టాలను నివారించుకునేందుకు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు గతంలో ఎఫ్ఎఫ్‌సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మెట్రో టికెట్ రేట్లు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మే 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. అనంతరం పెంచనున్న మెట్రో టికెట్ ఛార్జీల పెంపును మే 10వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

పెరగనున్న టికెట్ల ఛార్జీలు ఇలా (సుమారుగా)


దూరం (కి.మీ.లో) - 0 నుంచి 2 కి.మీ
ప్రస్తుత ఛార్జీ - రూ.10
పెరిగే ఛార్జీ - రూ.15

2 నుంచి 4 కి.మీ 
ప్రస్తుత ఛార్జీ రూ.15
పెరిగే ఛార్జీ - రూ.20

4 నుంచి 6 కి.మీ
ప్రస్తుత ఛార్జీ రూ.25
పెరిగే ఛార్జీ - రూ.35

6 నుంచి 8 కి.మీ 
ప్రస్తుత ఛార్జీ - రూ.30
పెరిగే ఛార్జీ - రూ.40

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

8 నుంచి 10 కి.మీ 
ప్రస్తుత ఛార్జీ - రూ.35
పెరిగే ఛార్జీ - రూ.45

10 నుంచి 14 కి.మీ 
ప్రస్తుత ఛార్జీ - రూ.40
పెరిగే ఛార్జీ - రూ.55

14 నుంచి 18 కి.మీ 
ప్రస్తుత ఛార్జీ - రూ.45
పెరిగే ఛార్జీ - రూ.60

18 నుంచి 22 కి.మీ
ప్రస్తుత ఛార్జీ - రూ.50
పెరిగే ఛార్జీ - రూ.65

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

22 నుంచి 26 కి.మీ
ప్రస్తుత ఛార్జీ - రూ.55
పెరిగే ఛార్జీ - రూ.70

26 కి.మీ పైన 
ప్రస్తుత ఛార్జీ - రూ.60
పెరిగే ఛార్జీ - రూ.75

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

కాగా ఎఫ్ఎఫ్‌సీ రిపోర్టు ఆధారంగా మెట్రో టికెట్ చార్జీలను పెంచుకునే హక్కు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్ టీకి ఉంటుందని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. మెట్రో రైల్వే యాక్ట్ 2002 ప్రకారం.. టికెట్ రేట్లను సవరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఏడాది బెంగళూరులో 50శాతం చార్జీలు పెంచారని ఆయన గుర్తు చేశారు. అందువల్లనే ఇప్పుడు హైదరాబాద్‌లో 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

Metro Charges | Hyderabad Metro | hyderabad metro news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING : భయపడేదే లేదు.. కాళేశ్వరం నోటీసులపై ఈటల ఫస్ట్ రియాక్షన్!

పీసీ ఘోష్‌ కమిషన్‌నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటల.. నోటీసులకు భయపడేది లేదన్నారు. తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్ గా ఉన్నారని చెప్పారు.

New Update
etela reaction

కాళేశ్వరం ప్రాజెక్టులో  భాగంగా మాజీ సీఎం  కేసీఆర్,  మాజీ మంత్రులు హరీష్, ఈటలకు పీసీ ఘోష్‌ కమిషన్‌ మంగళవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటల.. నోటీసులకు భయపడేది లేదన్నారు. తాను ఆర్థిక శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్ గా ఉన్నారని చెప్పారు.  పీసీ కమిషన్ ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.  తనతో మంత్రులుగా పనిచేసిన వాళ్లంతా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా అని ఈటల ప్రశ్నించారు. కాగా జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్‌కు, జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్‌ను విచారణకు రావాలని  పీసీ కమిషన్ జారీ చేసిన  నోటీసుల్లో స్పషం చేసింది. 

వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి పీసీ ఘోష్‌ కమిషన్‌  రిపోర్టును సమర్పించాల్సి ఉంది. అయితే కేసీఆర్, హరీష్, ఈటల స్టేట్​మెంట్లు లేకుండా రిపోర్ట్​ ఇస్తే లీగల్​ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో.. వారిని కూడా విచారించాకే రిపోర్టు ఇవ్వాలని కమిషన్​ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఇప్పటిదాకా 109 మంది అధికారులు, ప్రైవేట్​వ్యక్తులను కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారించింది.

కేసీఆర్ తో హరీష్ భేటీ

మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గతంలో ఆయన ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్నప్పుడే కాళేశ్వరం నిర్మించారు. ఈక్రమంలో హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. వారిద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం హరీష్ రావు తెలంగాణలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని చెప్పారు. అయితే పీసీ ఘోష్‌ కమిషన్‌ కు విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

 

Advertisment
Advertisment
Advertisment