Jurala Project: జూరాలకు భారీగా వరద నీరు.. గేట్ల ఎత్తివేత
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు.
ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. దాదాపు 100కి పైగా ఇళ్లు నీట మునిగాయి. బలమైన గాలులకు చెట్లు ఇళ్లపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా కొందరు మరణించినట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వేసవి ఎండ తీవ్రతో నగరానికి ఒక్కసారిగి ఉపశమనం కలిగింది. ఈదురుగాలులు, దుమ్ము తుఫాన్తో ఘజియాబాద్, కర్నాల్లోని ఎన్సిఆర్ ప్రాంతాలలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.