Crime News: ఢిల్లీ సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం
ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీల మధ్య వ్యక్తిగత వైరం తీవ్ర స్థాయికి చేరి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో అమన్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తికి తీవ్రగా గాయాపడ్డాడు.