ఉద్యోగులకు బిగ్ షాక్.. | Big shock for employees.. | Layoffs | Nissan Company | RTV
నిస్సాన్ మోటార్ ఒకేసారి 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనాల్లో అమ్మకాలు తగ్గడంతో కంపెనీ ఆదాయం 94 శాతానికి పడిపోయింది. ఈ క్రమంలోనే 15 శాతం ఉద్యోగస్థులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై మాజీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా ఉద్యోగుల పై వివక్ష చూపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఆ ఆరోపణలను టీసీసీ ఖండించింది. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
తాను పనిచేసే కంపెనీ తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి టాయిలెట్ పేపర్పై రాజీనామా లేఖ రాశాడు. సింగపూర్కు చెందిన బిజినెస్ ఉమెన్ ఏంజెలా యో ఈ లెటర్ను లింక్డ్ ఇన్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.
డోజ్కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
కేంద్ర ఉద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారికి 2 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటూ దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పథకం పీఎల్ఐకు కేబినెట్ ఆమోదం తెలిపింది.