TS: ఉద్యోగులకు డబుల్ డీఏ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం

నిన్న సుదీర్ఘంగా ఐదు గంటలపాటూ తెలంగాణ కేబినెట్ మీటింగ్ సాగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని డిసైడ్ అయింది. 

New Update
Telangana Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ

 తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించాలని డిసైడ్ అయింది. రాష్ట్ర అభివృద్ధితో పాటూ ప్రజల సంక్షేమం పై దృష్టి సారించాలని కేబినెట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించింది. ఇందులో ఒకటి వెంటనే ఇవ్వాలని...రెండోది ఆరు నెలల తర్వాత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని కలిగించనుంది. అలాగే మహిళా స్వయం సహాయ బృందాల సభ్యలకు ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపుల కోసం రూ. 70 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

హెల్త్ కేర్ కోసం ట్రస్ట్..

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆరోగ్య కార్డులను కూడా జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఉద్యోగులు రూ. 500 చొప్పున జమ చేస్తే...అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చిన మొత్తాన్ని జమ చేసి ఆరోగ్య బీమా కింద మంజూరు చేస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశ విస్తరణపై కూడా కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. మెట్రో సేవలను నగరంలో మరింత విస్తృతం చేయడం దానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చ చేశారు. అలాగే ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భట్టి చెప్పారు. 

 

Also Read: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు