Earthquakes Today: 30 నిమిషాల్లో రెండు భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు!
మణిపూర్లో 30నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. చురచంద్పూర్లో రిక్టర్ స్కేలుపై 5.2తీవ్రత నమోదు అయింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే నోనీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రత నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం రాలేదు.
Earthquake: గజగజ వణికించిన భారీ భూకంపం.. ప్రజలు పరుగులే పరుగులు- ఎక్కడంటే?
న్యూజిలాండ్లో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం న్యూజిలాండ్లోని రివర్టన్ తీరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది అని తెలిపింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
Delhi Earthquake: భూకంపం టైంలో పెద్ద శబ్ధం ఎందుకు వస్తుందో తెలుసా?
తక్కువ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపనతోపాటు భారీ శబ్దాలు వినిపిస్తుంటాయని జియోలాజికల్ సైంటిస్టులు తెలిపారు. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా బూమ్ అనే శబ్దం వస్తుందంటున్నారు. కొన్నిసార్లు కంపనాలు లేకున్నా.. భారీ శబ్దాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
Earthquake: ఏపీలో మరోసారి భూకంపం.. భయంతో జనం పరుగులు!
ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో పరుగులు తీశారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి.. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
BIG BREAKING: రాష్ట్రంలో మరోసారి భారీ భూకంపం!
ఏపీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. శంకరాపురం, పోలవరం, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురం సహా పలుచోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.