Earthquakes Today: 30 నిమిషాల్లో రెండు భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు!

మణిపూర్‌లో 30నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. చురచంద్‌పూర్‌లో రిక్టర్ స్కేలుపై 5.2తీవ్రత నమోదు అయింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే నోనీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రత నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం రాలేదు.

New Update
Earthquakes In Nepal

Earthquakes

గత కొన్ని రోజులుగా భూకంపాలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తరచూ ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటుంది. గతంలో కంటే పోలిస్తే ఈ ఏడాది భూకంప తీవ్రతలు అధికంగా ఉన్నాయి. తాజాగా మరోసారి భూమి కంపించింది. 

ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

చురచంద్‌పూర్‌లో భూకంపం

బుధవారం (మే 28) మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో భూకంప తీవ్రతలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం.. భూకంపం తెల్లవారుజామున 1:54 గంటలకు 24.46 N అక్షాంశం, 93.70 E రేఖాంశం వద్ద సంభవించిందని తెలిపింది. భూకంపం 40 కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించింది. 

ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

నోనీలో భూకంపం

ఇది జరిగిన అతి కొద్ది నిమిషాల్లోనే మణిపూర్‌లోని నోనీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం.. భూకంపం తెల్లవారుజామున 2:26 గంటలకు 24.53 N అక్షాంశం, 93.50 E రేఖాంశం వద్ద సంభవించిందని తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా

Advertisment
Advertisment
తాజా కథనాలు