KTR కేసులో దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు |KTR E formula race | Green co company |RTV
కేటీఆర్ అరెస్ట్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదలదు KTRను ట్యాగ్ చేశాడు. జైలుకు వెళ్లేటప్పుడు 4 జతల బట్టలు, కర్చిఫ్, దుప్పట, పచ్చడి, సబ్బు, వింటర్ కాబట్టి స్వెటర్ కూడా తీసుకెళ్లాలని కేటీఆర్కు రాజాసింగ్ సూచించాడు.
కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అభిప్రాయపడింది.
మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కారు రేసులో నేడు ఏసీబీ విచారణకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి కష్టపడి ఈ ఫార్ములా కారు రేస్ను తీసుకొచ్చామన్నారు. ఎప్పటికైనా సత్యమే, న్యాయమే గెలుస్తుందని ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇవ్వాళ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, HMDA మజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉండగా.. బీఎల్ఎన్రెడ్డి A3గా ఉన్నారు.
ఫార్ములా-ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోయిన కేటీఆర్ కు మళ్లీ మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 10 : 30 గంటలకు తమ ముందు హాజరు కావాలంటూ ఇప్పటికే ఆయనకు నోటీసులు అందాయి. కాగా ఇదే కేసులో రేపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జనవరి 06వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.