/rtv/media/media_files/2025/06/25/formula-e-car-race-2025-06-25-16-35-19.jpg)
Formula E car race
Formula E car race : ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ మరో అడుగు ముందుకేసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు అందజేసింది. ఈ కేసు విచారణకు జూలై1న ఏసీబీ కోర్టుకు రావాలసిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారించింది. అయితే ఇటీవల కేటీఆర్ను మరోసారి విచారించిన ఏసీబీ, అరవిందకుమార్ను కూడా రెండవసారి విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: బరువు తగ్గేందుకు భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన ఇంజెక్షన్
గతంలో ఏసీబీ అరవింద్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా గత వారం కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్లు, స్పాన్సర్లు, ఆర్థిక శాఖ అనుమతులు ఇలా వివిధ అంశాలపై కేటీఆర్ నుంచి కీలక సమాచారం రాబట్టింది. అయితే ఈసారి కేటీఆర్ చెప్పిన సమాధానాల ఆధారంగా అరవింద్ ను ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఒకే సమయంలో ఇద్దరినీ కలిపి విచారించే అకాశాలను కూడా తోచిపుచ్చలేం.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో బీట్రూట్ రసం తాగితే ఏమవుతుందో తెలుసా..?
కాగా ఫార్ములా ఈ కారు రేసింగ్ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఏసీబీ విచారణలో వేగం పెంచింది, తిరిగి అరవింద్ కుమార్ ను విచారించడానికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. తాజా నోటీసులతో ఈ కేసులో ఏం జరగబోతున్నది అనేది విచారణ తర్వాత తేలనుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ వ్యవహారం, ఒప్పందాలు అన్ని తానై కేటీఆర్ వ్యవహరించారని గతంలో అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. గత మొన్నటి కేటీఆర్ విచారణ సందర్భంగా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే అలా ఈ సారి దర్యాప్తులో ఆయన చెప్పబోయే విషయాల ఆధారంగా కేటీఆర్ అరెస్టు చేస్తారా లేక మరో నిర్ణయ తీసుకుంటారనే చర్చ సాగుతోంది. కాగా ప్రస్తుతం అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఆయన తిరిగి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP Cabinet : ముగిసిన ఎపీ క్యాబినెట్..42 అంశాలకు ఆమోదం ...బనకచర్లపై కీలక వ్యాఖ్యలు