Formula-E Race Case : కేటీఆర్ కు నోటీసులు.. కవిత ఫైర్!

ఫార్ములా- ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌ లో ఘాటుగా స్పందించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నోటీసులు జారీ చేశారని మండిపడింది.

author-image
By Madhukar Vydhyula
New Update
Formula-E

Formula-E Race Case

Formula-E Race Case : ఫార్ములా- ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌ లో ఘాటుగా స్పందించింది. "రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గారికి కాంగ్రెస్‌ సర్కార్‌ మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం'జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

 

రాజకీయ కక్ష సాధింపే : హరీశ్‌రావు

ఫార్ములా-ఈ కార్ రేసు కేసు లో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ నేత హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కేటీఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనం. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారని ఆరోపించారు.

కేటీఆర్ కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్‌ను భారతదేశానికి అందులోనూ హైదరాబాద్‌కి తీసుకొచ్చారన్న ఆయన. ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారన్నారు. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నీ వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆపదు’ అని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు