Formula-E case : ఫార్ములా-ఈ కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్‌

తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు.

New Update
Formula E race

Formula E race

Formula-E case : తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. కాగా ఇప్పటికే కోకాపేటలో తన నివాసం నుండి నందినగర్‌ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా చేరుకున్నారు. అక్కడ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, హరీశ్‌రావుచ కేటీఆర్‌ మధ్య కీలక అంశాలపై చర్చ సాగినట్లు తెలుస్తోంది. నందినగర్‌ నుంచి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకోకున్నారు. అక్కడి నుంచి ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. 10 గంటలకు కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. దీంతో బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు.

Also Read: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!

తెలంగాణ భవన్‌ నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు..ఏసీబీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలివస్తారనే సమచారంతో  ఆఫీస్ ముందు 400 మంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏసీబీ కార్యాలయంలోకి అధికారులు ఎవరిని అనుమతించడంలేదు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు.‘రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదు. ఆరు గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం.. ఎండగడుతూనే ఉంటాం.. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తాం’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.  

తెలంగాణ భవన్ లో కేటీఆర్

ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. చట్టం  మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము.ఇది మూడోసారి విచారణకు పిలవటం. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం అని కేటీఆర్ అన్నారు.కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని  కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు .నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు.నన్ను మళ్లీ ఏసీబీ విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.

నన్ను అరెస్టు చేస్తారు..కేటీఆర్ సంచలన ఆరోపణ

ఈ కేసులో అవసరమైతే నన్ను అరెస్ట్ కూడా చేస్తారేమోనని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మాకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను. ఫార్ములా ఈ రేసులో తెలంగాణ ను ప్రపంచంలో నెంబర్ వన్ చేశాం.జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు.ఒక కేసు కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టిన మీ ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు లైట్ డిటెక్టర్ కు సిద్ధం కావాలని సూచించారు.

Also Read: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మహారాష్ట్ర పౌరులను అవమానించారన్న సీఎం

 ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో కేటీఆర్ జ‌న‌వ‌రి 9వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్నర గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. త‌న లాయ‌ర్ రామ‌చంద్రరావుతో క‌లిసి కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. 

Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు