KTR: ఇద్దరం లైవ్ డిటెక్టర్ టెస్టుకు వెళ్దాం..రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌

ఫార్ములా ఈ రేసింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనిపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన కేటీఆర్‌ సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్‌ విసురుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

New Update
Formula E Rase

Formula E Rase

KTR: ఫార్ములా ఈ రేసింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సవాల్‌ విసురుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Also Read: విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు

‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. మన ఇద్దిరిపైనా ఏసీబీ విచారణ జరుపుతోంది. ఇద్దరం లైవ్ డిటెక్టర్ టెస్టుకు వెళ్దాం.. దీనికి మీరు సిద్ధమేనా?’ అని సవాల్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నడపటం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లాగా తాను తప్పించుకునే వ్యక్తిని కాదు.. తప్పకుండా ఏసీబీ విచారణకు హాజరు అవుతా.. అధికారులకు సహకరిస్తా అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం దివాళా తీసిందని మీరు ప్రతిరోజూ మాట్లాడుతూ రాష్ట్ర పరువు తీయకండి.. ప్రజా ధనం వృథా చేయకండి. చేతగాకపోతే దిగిపోండి అని సీరియస్ గా వార్నింగ్‌ ఇచ్చారు.

Also Read: మరోసారి బెదిరింపులు.. పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న రాజాసింగ్!

కాగా,ఈ ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. నిజానికి గత నెల 28న విచారణకు వెళ్లా్ల్సి ఉండగా కేటీఆర్‌ విదేశీ పర్యటన కారణంగా అది వాయిదా పడింది. దీంతో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను గతంలో ఏసీబీ విచారించింది. 

Also Read: విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు