Goa Stampede: గోవాలో ఘోర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి
గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్లోని శ్రీదేవి లయ్రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.