Delhi Woman: వామ్మో.. పడక సుఖం ఇవ్వడం లేదని భర్తను చంపేసిన భార్య
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ (29) తన భర్త (32) పడక సుఖం ఇవ్వడం లేదని, అప్పులు చేశాడనే కారణంతో హత్యకు పాల్పడింది. నిహాల్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ (29) తన భర్త (32) పడక సుఖం ఇవ్వడం లేదని, అప్పులు చేశాడనే కారణంతో హత్యకు పాల్పడింది. నిహాల్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
మెదక్లో ఓనర్ కూతుర్ని సబీల్ అనే ఓ యువకుడు ప్రేమించాడనే కారణంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి దారుణంగా బండరాయితో చంపి, ఆపై మగ్దుంపూర్ శివారులో నగ్నంగా సబీల్ డెడ్బాడీని పడేసి పరారయ్యారు.
హైదరాబాద్లోని మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్స్లో 10th విద్యార్థిని హన్సిక ఐదవ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ గౌలిదొడ్డిలో విషాదం చోటు చేసుకుంది. జేకే గ్రాండ్ హాస్టల్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చింతల యామిని అనే యువతి ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చేస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హనీట్రాప్లో చిక్కుకున్న డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి మల్లికార్జున్ రెడ్డిపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2022లో జూన్లోనే ఈ కేసు నమోదైంది. దేశ రక్షణకు సంబంధించి రహస్య సమాచారాన్ని ఇతరులకు పంపించినట్లు పోలీసులు నిర్ధారించారు.
సంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ అధికారి వద్ద హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కొమ్ముల రాజు గంజాయి ప్యాకెట్లతో బైక్ వద్ద గంజాయి పట్టుకుని ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 800 గ్రాముల గంజాయిని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ రైల్వే స్టేషన్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ను కన్వరియాస్ యాత్రికులు (శివ భక్తులు) చితకబాదారు. ఆ సీఆర్పీఎఫ్ జవాన్ టికెట్ అడగటంతో వాళ్లు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మేడ్చల్లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్గా గుర్తించారు. అప్పులు తీర్చినప్పటికీ కొందరు తనను వేధిస్తున్నారని అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు ఓ లాడ్జీలో సెల్ఫీ వీడియో తీసుకొని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు.