BREAKING: సంగారెడ్డిలో గంజాయి కలకలం.. హోంగార్డు అరెస్టు!

సంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ అధికారి వద్ద హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కొమ్ముల రాజు గంజాయి ప్యాకెట్లతో బైక్ వద్ద గంజాయి పట్టుకుని ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 800 గ్రాముల గంజాయిని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.

New Update
Ganja

Ganja

సంగారెడ్డిలో గంజాయి కలకలం సృష్టించింది. జిల్లా కోర్టులో ఓ అధికారి వద్ద హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కొమ్ముల రాజు గంజాయి ప్యాకెట్లతో బైక్ వద్ద నిల్చోని ఉన్నాడు. స్థానికులు అప్పుడు రాజు వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వీరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. రాజు దగ్గర నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపుగా రూ.80 వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

Advertisment
తాజా కథనాలు