BREAKING: హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రివేణిని కొంతకాలంగా కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఉగ్రవాద గ్రూపుల ఆనవాళ్లు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఐఎస్ఐతో పాటు ఖలీస్థాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక బోయిగూడలో జీ ప్లస్ 2 భవనంలోని రెండవ అంతస్తులో ఉండే చెప్పుల గోదాంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదాల్లో మొత్తం 18 మందికి గాయాలయ్యాయి.
మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పెట్రోల్ ట్యాంకర్కు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ట్యాంకర్ను ఆపడం వలన భారి ప్రమాదం తప్పింది.
నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కుసుమర్తిలో రైతు తిప్పణ్ణ(50) భీమా నదిలో గల్లంతు అయ్యాడు. పొలానికి నీరు రావడం లేదని గుర్తించి నదిలోకి దిగానే మొసలి ఆకస్మాత్తుగా దాడి చేసి నదిలోకి లాక్కెళ్లింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లోని చార్మినార్ గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదంపై ఆరాతీశారు. ప్రమాద ఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాట ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణించడం వల్ల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.