/rtv/media/media_files/2025/06/15/0SauKFBvt2lj0RkYEesO.jpg)
Covid-19 Case in India
దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో భారతదేశంలో 269 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,400కు చేరింది. ఈ క్రమంలో 9 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్ని యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
రాష్ట్రాల వారీగా యాక్టివ్ కేసులు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ కరోనా కేసులు 2109కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 102 యాక్టివ్ కేసులు, అస్సాంలో 26, బీహార్లో 41, చండీగఢ్లో 2, ఛత్తీస్గఢ్లో 50, రాజధాని ఢిల్లీలో 672, గోవాలో 6, గుజరాత్లో 1437, హర్యానాలో 97, జమ్మూ కాశ్మీర్లో 9, జార్ఖండ్లో 25, కర్ణాటకలో 527, లడఖ్లో 3, మధ్యప్రదేశ్లో 120, మహారాష్ట్రలో 613, మణిపూర్లో 5, ఒడిశాలో 45, పంజాబ్లో 29, రాజస్థాన్లో 180, సిక్కింలో 50, తమిళనాడులో 232, తెలంగాణలో 8, త్రిపురలో 2, ఉత్తరాఖండ్లో 5, ఉత్తరప్రదేశ్లో 248, పశ్చిమ బెంగాల్లో 747, పుదుచ్చేరిలో 10 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
అదే సమయంలో ఇప్పటివరకు దాదాపు 11,967 మంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో ఒక్క యాక్టివ్ కోవిడ్ కేసు కూడా లేని రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అవి అరుణాచల్ ప్రదేశ్, మిజోరం. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క యాక్టివ్ కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
Also read: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?
ఎన్ని మరణాలు?
కేరళలో 3 మరణాలు, మహారాష్ట్రలో 4 మరణాలు, రాజస్థాన్లో ఒక మరణం, తమిళనాడులో ఒక మరణం నమోదైంది.