/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mask-jpg.webp)
COVID 19
COVID 19: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోమారు తన ప్రతాపాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదువుతుండగా తాజాగా వరంగల్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలకలం సృష్టించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో ఆరు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి కొత్త కేసులు నగరంలో నమోదు కాలేదని తేల్చి చెప్పారు.
Also Read: 'ట్రంప్కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు
వరంగల్ జిల్లాలోని మహాత్మగాంధీ మెడికల్ కాలేజీ( ఎంజీఎం) సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వివిధ కారణాలతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి రాగా వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వారికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. దీంతో నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్ కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read: ఆర్మీ సమాచారం లీక్.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
అయితేఈ విషయంపై వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు భిన్నంగా స్పందించారు. నగరంలో కరోనా కేసులు నమోదైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు. కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రం కరోనా పేషేంట్లకు వైద్యం అందజేస్తున్నారని, మరో కొంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని అధికారులు దృవీకరించాల్సి ఉంది.
Also Read: ఏం మనిషివిరా.. తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు