Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్
కృష్ణజింకల వేట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. యాక్టర్స్ సైఫ్ అలీఖాన్, టబు , నీలం, సోనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో సవాల్ చేసింది.
Salman Rushdie: సల్మాన్ రష్దీపై హత్యాయత్నం నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష
అంతర్జాతీయ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం కేసులో తీర్పు తీరోజు వెల్లడైంది. ఈ కేసులో దోషిగా ఉన్న న్యూజెర్సీకి చెందిన హాది మతార్ కు 25 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోయారు.
BIG BREAKING: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Jethwani case: జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. IPS ఆఫీసర్ అరెస్ట్!
ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు.
KTR : ఉట్నూరు పోలీసు స్టేషన్లో కేసు..కేటీఆర్ కు హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. రాజకీయ ప్రేరేపిత కేసుగా భావిస్తూ ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.
వైసీపీకి బిగ్ షాక్.. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కీలక నేతపై కేసు
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వైసీపీ నేత యడ్ల తాతాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, వైజాగ్లను కేంద్రంగా చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాతాజీతో పాటు నాగేశ్వరరావు, వెంకటరావు, మురళీపై కేసు నమోదు చేశారు.
Paster praveen: ప్రవీణ్ ది హత్య కాదు యాక్సిడెంట్.. మద్యం మత్తులోనే: సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!
పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు.
BREAKING: రాజాసింగ్పై కేసు నమోదు
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.