/rtv/media/media_files/2025/08/01/anil-ambani-2025-08-01-19-18-36.jpg)
Anil Ambani
Anil Ambani: ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది. ఆయనపై ఎస్బీఐ బ్యాంక్ చేసిన ఫిర్యాదు మేరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీపై కేసు నమోదైంది. ఈ మేరకు ‘ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ) దర్యాప్తునకు సిద్ధమైంది.ఈ విషయమై ఆగస్టు 21న ముంబై ఎస్బీఐ బ్యాంకు సీబీఐని ఆశ్రయించినట్లు తెలిసింది. ముంబైకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్, దాని డైరెక్టర్ అనిల్ అంబానీ తప్పుడు అకౌంట్స్ చూపించి, మోస పూరితంగా 2,219 కోట్ల రూపాయల లోన్ పొందినట్లు ఎస్బీఐ ఫిర్యాదు చేసింది.
Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!
అందులో భాగంగా ఎస్బీఐ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఇంటర్ కంపెనీ లోన్ లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులు కూడా మోసంలో భాగం పంచుకున్నట్లు వెల్లడించింది. బ్యాంకును మోసం చేసి రూ. 2929.05 కోట్ల వరకు నష్టం వచ్చేలా చేశారని బ్యాంక్ ఆరోపించింది. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ మిస్ కండక్ట్ అండర్ ది ప్రివిషన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సీఐబీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. దర్యాప్తుకు సిద్ధమైంది.
Also Read: మోదీతో కారులో మాట్లాడిన సీక్రెట్ లీక్ చేసిన పుతిన్
అయితే ఈ విషయంలో ఎస్బీఐ పెట్టిన కేసుపై అనిల్ అంబానీ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఆయన వివరణ ఇస్తూ.. ‘ఎస్బీఐ దాదాపు పదేళ్ల క్రితం ఆ కేసు పెట్టిందన్నారు. ఆ సమయంలో అనిల్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రతీ రోజూ కంపెనీలో జరిగే పనులతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎస్బీఐ ఐదుగురు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై కేసును ఉపసంహరించుకుందని తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎస్బీఐ ఆధ్వర్యంలోని కమిటీ ఆఫ్ క్రెడిట్స్ పర్యవేక్షణలో నడుస్తోంది. అనిల్ అంబానీ తనపై వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు’ అని ఆ ప్రతినిధి వెల్లడించారు.
Also Read : New Liquor Policy: మందు బాబులకు గుడ్న్యూస్.. ఇకపై హాటల్స్లో కూడా బీర్ల అమ్మకాలు