/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
Jagan
సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతిపై హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ను రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. అయితే ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన జగన్ పర్యటనలో ఓ కారు ఢీకొట్టడంతో సింగయ్య చనిపోయాడు. ఇతని మృతిపై జగన్తో పాటు కారు డ్రైవర్పై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్ను A2గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే పోలీసులు జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
ఈ సెక్షన్ల కింద..
ఇదిలా ఉండగా ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105, 49 సెక్షన్లను చేర్చారు. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్ని BNS 105 సెక్షన్లో పేర్కొన్నారు. దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలన్నింటినీ విశ్లేషించి ఇది కల్పబుల్ హోమీసైడ్ అని ఈ సెక్షన్ జత చేశారు. వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు.
ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?
జగన్ సహా మిగతా నిందితులపై ఈ సెక్షనే పెట్టారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5నుంచి-10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించేందవచ్చు. ఇది నాన్ బెయిల్బుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై BNS 49 సెక్షన్ను ఈ కేసులో చేర్చారు. మొదట నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని బీఎన్ఎస్ 106(1)) సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దానికి మరో రెండు సెక్షన్లు యాడ్ చేశారు.
ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!