🔴Live News: విమానం లోపల కమ్మేసిన పొగ మంచు.. ఊపిరాడకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. కొంత మంది గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై వెళుతున్న సుమంత్ కారును అడ్డుకొని, ఆయనను కిందికి దించి ఇనుప రాడ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షెండేకు వచ్చిన హత్య బెదిరింపులపై ఆయన స్పందించారు. గతంలో కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. తనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయని.. కానీ వీటికి తాను భయపడలేదని స్పష్టం చేశారు.
కర్మ వెంటాడడం అంటే ఇదేనేమో అనేంతలా ఓ వీడియో వైరల్గా మారింది. ఓ యువతి స్కూటీపై వెళ్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోతున్న అదేవ్యక్తిని మళ్లీ అదేయువతి స్కూటీతో ఈసారి బలంగా గుద్దింది. ఇది చూసి పలువురు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి అంబేద్కర్ ను ఆయన వారసులను అవమానిస్తున్నాడు. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అంబేద్కర్ జయంతిలోపు కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే గేట్లను బద్దలుకొడుతామని హెచ్చరించారు.
చైనీస్ కంపెనీ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీ నిర్ణయించిన సమయాల్లో మాత్రమే టాయిలెట్కు వెళ్లాలని తెలిపింది. అది కూడా కేవలం 2 నిమిషాలు మాత్రమే బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎవరైనా ఈ రూల్ బ్రేక్ చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుందని వెల్లడించింది.
ఓటీటీ ఫ్లాట్ఫామ్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్ను ప్రసారం చేయకూడదని తెలిపింది. అన్ని ఓటీటీ సంస్థలు నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. పిల్లలకు ఎ రేటెడ్ కంటెంట్ నుంచి దూరంగా ఉంచాలని తెలిపింది.