Balochistan On India Pak War | పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ | Pakistan VS BLA
పహల్గాం దాడితో భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యతగా లేదు. దేశంలో అంతర్గత ఉద్రిక్తలతో పాటు పొరుగుదేశాలతో ఉన్న విభేధాల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
భారత్తో ఉద్రిక్తత పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచిఉంది. ఆఫ్గనిస్తాన్లో కలవాలని తాలిబన్లు, బలుచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఏర్పాటు వాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి ఉంది.
పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్లో జరుగుతున్న దాడులకు ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని బలహీన పాలనగా అభివర్ణించారు.
పాకిస్థాన్లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) మరోసారి రెచ్చిపోయింది. పాక్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్ను టార్గెట్ చేసి బాంబు దాడికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో 90 మంది సైనికులు మృతి చెందినట్లు బీఎల్ఏ తెలిపింది.
పాకిస్థాన్ రెండు ముక్కలు కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హైజాక్ ఘటనతో బలూచ్ స్వాతంత్ర ఉద్యమం మరింత ఊపందుకుంది. పాక్లో 44 శాతం ఉన్న బలూచిస్థాన్ త్వరలోనే మరో దేశంగా అవతరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ట్రైన్ హైజాక్ వెనుక భారత్ హస్తముందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై విదేశాంగ శాఖ పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం అంతటా తెలుసని ధ్వజమెత్తింది. తమ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని హితువు పలికింది.