BREAKING: భారీ బాంబు పేలుడు.. స్పాట్‌లోనే నలుగురు

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు బస్సును లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో ఐఈడీ పేల్చినట్లు తెలుస్తోంది.

New Update
Huge bomb blast in Balochistan

Huge bomb blast in Balochistan

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని మార్కెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు పోలీసు బస్సులో 40 మంది ఉండగా.. నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసు బస్సును లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో ఐఈడీ పేల్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

స్వతంత్ర దేశంగా..

ఇదిలా ఉండగా పాకిస్తాన్(Pakistan) కు ఇన్నాళ్ళు పక్కలో పోటులో ఇబ్బంది పెట్టిన బలూచిస్తాన్ ఇప్పుడు ఏకంగా తాము విడిపోతున్నామంటూ ఆ దేశానికి షాక్ ఇచ్చింది. పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ తెలిపింది.

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

క్వెట్టాలోని కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని కూడా షేర్ చేసింది.  భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ కోరింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఇప్పటికి విముక్తి పొందిందని తెలిపింది. దీనికోసం నిరసనలు కూడా చేస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు