BLA Attack on pak  : పేలిన పాకిస్థాన్‌.. 40 సిటీలు ఖతం

ఒకవైపు బారత్‌ దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు బలూచ్‌ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ చేతుల్లో నుంచి బలూచిస్తాన్‌ జారిపోతోంది. BLA వరుస దాడులతో పాక్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. BLA పాక్‌ పై బాంబుల వర్షం కురిపిస్తోంది.

New Update

BLA Attack on pak  ఒకవైపు బారత్‌ దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు బలూచ్‌ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ చేతుల్లో నుంచి బలూచిస్తాన్‌ జారిపోతోంది. BLA వరుస దాడులతో పాక్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. పాక్‌ పై బలూచ్‌ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. పాక్‌ సైన్యాన్ని.. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ తరుముతోంది. బలూచిస్తాన్‌లో 40 చోట్ల పాక్‌ ఆర్మీపై BLA దాడులు చేసింది. పాక్‌ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుని, హైవేలను నిర్బంధించింది. పాకిస్తాన్‌ పోలీసులను అరెస్ట్‌ చేసింది. పాక్‌ ఆర్మీ ఇన్‌ఫార్మర్లను కూడా BLA ఫైటర్లు అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. పాక్‌ బలగాలపై ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. బాంబులతో పాక్‌ ఆర్మీ వాహనాలను పేల్చివేస్తున్నారు. అంతేకాదు దాడులు చేసింది తామేనంటూ బలూచీ ఆర్మీ బహిరంగ లేఖలు కూడా రాసింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

బలూచిస్తాన్‌లో తిరుగుబాట్లతో పాక్‌ తోక ముడుస్తోంది. బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఫైటర్స్ సాయుధ పోరాటం చేస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్తాన్‌ ఆర్మీని బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ‌ సాయుధులు తరుముతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. బలూచిస్తాన్‌ లోని మాచ్‌కుండ్‌ ప్రాంతంలో పాక్‌ ఆర్మీ వాహనంపై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో 14 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు. కలాట్‌ జిల్లాలో ఉన్న మాంగోచార్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్‌ఏ ప్రకటించింది. స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లను, పోలీసులను తమ నిర్బంధంలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. హైవేలను నిర్బంధించడం, నిఘా సంస్థల ప్రతినిధులను బంధించడం, మిలిటరీ కాన్వాయ్‌పై దాడులు వంటివి తమ పనేనని ప్రకటించారు.

Also Read: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO

బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టాలో ఉన్న పాకిస్తాన్‌ ఫ్రాంటియర్‌ కార్ప్స్‌ ప్రధాన కార్యాలయంపై BLA మెరుపుదాడులు చేసింది. క్వెట్టాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. క్వెట్టా కాంబ్రానీలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌పై దాడి చేసింది బలూచిస్తాన్ ఆర్మీ . ఆ తరువాత దగ్గరలో ఉన్న 6 ప్రాంతాల్లో ఒకేసారి పేలుళ్లు జరిపారు. పాక్‌లో చమురు క్షేత్రాలపై బలూచీలు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాక్ సైనికులు సహా చాలా మంది సాధారణ ప్రజలు కూడా చనిపోయారని తెలుస్తోంది. ఈ దాడులతో పాకిస్తాన్ సైన్యం క్వెట్టా నుంచి పారిపోయినట్లు సమాచారం. పాకిస్తాన్‌ ఆర్మీకి వ్యతిరేకంగా తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని BLA ఫైటర్లు చెబుతున్నారు. కాగా గడచిన నెలరోజుల్లో 100 మంది పాక్‌ సైన్యాన్ని హతం చేశామని బీఎల్‌ఏ ప్రకటించుకుంది.

 Also Read: ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు