యాంకర్ కావ్య శ్రీ పై వైసీపీ నేత దాడి | Attack On Anchor Kavya Sri | RTV
ఉత్తరప్రదేశ్ను తోడేళ్ళ గుంపు వణికిస్తోంది. ఇవి కనిపిస్తే కాల్చి చంపేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే అంటున్నారు ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్.
ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడులు మొదలుపెట్టింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్తో సహా చాలా చోట్ల క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడింది.ఈ దాడుల కారణంగా అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.రష్యా దాడులను అడ్డుకునేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు.
ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అవతార్ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్ అనే టీడీపీ నాయకుడు దాడి చేశాడు.మూడు నెలల క్రితం గౌస్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు ఖలీలే కారణమని గౌస్ కక్ష పెంచుకుని దాడికి దిగాడు.
మిడిల్ ఈస్ట్లో యుద్ధం రోజురోజుకూ ఎక్కువైపోతోందే తప్ప ఆగడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది కానీ..ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ మీద హెజుబుల్లా ప్రతీకార దాడుల్లో భాగంగా 50 రాకెట్లతో విరుచుకుపడింది.
ఏపీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో రవి అనే యువకుడు గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. మత్తులో ఉన్నప్పుడు వైద్యం చేయలేనని చెప్పిన డాక్టర్ కార్తికేయపై తన అన్న కౌన్సిలర్ నరేష్ ఆధ్వర్యంలో రవి దాడికి పాల్పడ్డాడు. రక్షణ కావాలంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెన్సెల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ దాడిలో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. దానికి కారణం ఒక మహిళ అంట. అందుకే ఆమెకు ట్రంప్ స్టేజ్ మీదకు పిలిచి మరీ కృతజ్ఞతలు చెప్పారు.