Madhya Pradesh Doctor: పిల్లలకు దగ్గు మందు సిరప్ ఇచ్చిన డాక్టర్ అరెస్ట్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్ వల్ల 11 మంది చిన్నారులు మరణించిన కేసులో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. ఆ పిల్లల్లో చాలా మందికి అదే దగ్గు మందు సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.