Rajasthan : పాకిస్థాన్ కు గూఢచర్యం..పంజాబ్ వ్యక్తి అరెస్ట్ !
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది.
ప్రస్తుతం 14 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై దేశ వ్యాప్తంగా 121 కేసులు నమోదయ్యాయి. లాహోర్ నగరంలో 12 ఉగ్రవాద కేసులు, ఫైసలాబాద్ 14 కేసులు, దేశవ్యాప్తంగా 22 ఉగ్రవాద కేసులు నమోదు చేశారు.
మావోయిస్ట్ అగ్ర నేతలు, పార్టీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది.ఈ సంస్థ రాష్ట్రంలో శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ (SLBC) నిర్మాణ పనులు చేపడుతున్నది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది.
ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన డ్రగ్స్ విక్రయం ఆగడం లేదు. తాజాగా మియాపూర్ అల్విన్ కాలనీవద్ద హ్యాష్ఆయిల్ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సోనియా అనే మహిళ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు.
కర్నూలు బస్సు ప్రమాదంలో A2గా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల కర్నూలు హైవేపై బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
చిన్నారుల మృతికి కారణమైన 'కోల్డ్రిఫ్' దగ్గు సిరప్ను తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. పోలీసులు శ్రీసన్ ఫార్మా కంపెనీ ఓనర్ని గురువారం అరెస్ట్ చేశారు. శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్లు 3 రోజుల నుంచి పరారీలో ఉన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్ వల్ల 11 మంది చిన్నారులు మరణించిన కేసులో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. ఆ పిల్లల్లో చాలా మందికి అదే దగ్గు మందు సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
అస్సాం సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకురాలు అమృతప్రభ మహంతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.