Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.