DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

indigo delhi-srinagar Flight:పాడు బుద్ధి పోనిచ్చుకోలేదు...వాతావరణం బాలేదన్నా పర్మిషన్ ఇవ్వని పాకిస్తాన్

ఏం జరిగినా పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. నిన్న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం భారీ కుదుపులకు లోనైంది.దానిని తట్టుకునేందుకు పాక్ గగనతలంలోకి వస్తామని పైలెట్ రిక్వెస్ట్ చేసినా..దానికి లాహోర్ ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. 

New Update
delhi

Delhi -Srinagar Flight

పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు దేశాలు తమ గగనతలాలను మూసేకున్నాయి. ఒకరి విమానాలు మరొకరి ఎయిర్ బేస్ లోకి రాకుండా  ఆంక్షలు విధించుకున్నాయి. ప్రస్తుతం యుద్ధం ఆగినప్పటికీ ఈ ఆంక్షలను, దౌత్య సంబంధాలను మాత్రం ఇంకా కంటిన్య చేస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ తన గగనతలాన్ని మరో నెల రోజుల పాటూ మూసేస్తున్నామంటూ ఈ మధ్యనే ప్రకటించింది. దీని ఎఫెక్ట్ నిన్న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఫ్లైట్ మీద కూడా పడింది. 

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన పడటంతో పైలట్ అప్రమత్తం చేశాడు. దీంతో  227 మంది ప్రయాణికులతో విమానం శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దిగింది. VT-IMD రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఇండిగో విమానం 6E2142 శ్రీనగర్ సమీపిస్తున్న సమయంలో వడగళ్ల వాన కారణంగా తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంది. విమానం 227 మంది ప్రయాణికులు ఉండగా.. పైలట్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే దీనిలో పైలెట్ చాకచక్యం వలన ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయింది. 

నో చెప్పిన లాహోర్ ఏటీసీ

అయితే వాతావరణం బాలేక విమానం కుదుపులకు లోనవుతున్న సమయంలో...ఆ వాతావరణ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు లాహోర్ ఎయిర్ బేస్ లో కాసేపు ఉంటామని పైలెట్ అక్కడి ఎటీసీ ను సంప్రదించారు. దీనికి లాహోర్ ఎటీసీ అంగీకరించలేదు. భారత విమానాలకు తమ గగనతలంలోకి ప్రవేశం లేదంటూ చెప్పుకొచ్చారు. ఫ్లైట్ కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పినా కనికరించలేదు. పాకిస్తాన్ ఈ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏం జరిగినా దాయాది దేశం తన వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదని మండిపడుతున్నారు.  

 today-latest-news-in-telugu | delhi | srinagar | flight | pakistan

Advertisment
Advertisment
Advertisment