/rtv/media/media_files/2025/04/26/NrN83vLyf4D6Iq9ni9c7.jpg)
Marriage cancel
పహల్గామ్ ఉగ్రదాడితో పాక్తో భారత్ సంబంధాలను తెంచుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో పాటు అన్ని విధాలుగా కూడా కనెక్షన్లను ఆపేసింది. పాకిస్థాన్ వీసాలు రద్దు చేయడంతో పాటు వాఘా బార్డర్ను కూడా క్లోజ్ చేసింది. అయితే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాక్ సంబంధాలు తెగిపోవడంతో ఓ యువకుడి పెళ్లి ఆగిపోయింది.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్ఎఫ్ యూ టర్న్
राजस्थान के दूल्हे को पाकिस्तान जाने से रोका: 30 अप्रैल को अमरकोट में होनी थी शादी, 3 साल की कोशिश के बाद मिला था वीजा#Rajasthan #PahalgamTerroristAttack
— Dainik Bhaskar (@DainikBhaskar) April 26, 2025
पूरा वीडियो देखने के लिए लिंक पर क्लिक करें-https://t.co/82dborokQ5 pic.twitter.com/ET2FVudIHp
ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు మూడు నెలలు బ్రేక్!
నాలుగేళ్ల క్రితం..
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ బార్మర్కు చెందిన సైన్తాన్ సింగ్కు సింధు ప్రావిన్స్లోని అమర్ కోట్ జిల్లాకు చెందిన కేశర్ కన్వర్ అనే యువతితో నాలుగేళ్ల క్రితం పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే పాకిస్థాన్ వెళ్లడానికి వీసా అన్ని రావడానికి వీరికి దాదాపుగా మూడేళ్ల పట్టింది. చివరకు ఫిబ్రవరి 18వ తేదీన వీసా క్లియరెన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో బరాత్తో పెళ్లి కొడుకు పాక్లోకి ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు.
ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
ఈ క్రమంలో బరాత్తో వాఘా బార్డర్ దగ్గరకు చేరుకున్నాడు. దీంతో ఆర్మీ అతన్ని పాకిస్థాన్లోకి వెళ్లనివ్వలేదు. ఎంత బతిమలాడినా కూడా ఒప్పకోలేదు. పెళ్లీ లేదు.. గిల్లీ లేదు.. వెళ్లిపోమని వెనక్కి పంపించేశారు. నాలుగేళ్ల నుంచి ఈ పెళ్లికి ఎదురుచూడగా.. ఇప్పుడు ఆగిపోవడంతో ఆ వరుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా తోచడం లేదని బాధపడ్డాడు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!