AP Crime: పశ్చిమగోదావరిలో విషాదం..ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపావరంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాల అయ్యాక కాలువలో స్నానానికి వెళ్లారు. మృతులు 5వ తరగతి చదువుతున్న సాయి పవన్, శరత్ కుమార్గా గుర్తించారు.