AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే కీలక చర్చ!
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అమరావతి సచివాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.
కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు.
హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. ఈ రోజు అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశానికి వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన అభినందించారు. సినిమా సూపర్ హిట్ కావాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చ సాగింది.
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగనుంది. బుధవారం ఉదయం 11.00 గంటలకు జరిగే ఈ సమావేశంలో అమరావతి భూసేకరణ, జీఏడీ టవర్ టెండర్లు, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, కూటమి ఏడాది పాలనపై ప్రధానంగా చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నేటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫైళ్ల క్లీయరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. చంద్రబాబుకు 6, లోకేష్ కు 8, పవన్ కు పదో ర్యాంకు దక్కింది. ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఫరూక్ ఉండగా.. లాస్ట్ ప్లేస్ లో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 6న సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో 2025-26 బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు వివిధ అంశాలపైనా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.