/rtv/media/media_files/2025/04/15/4Wzqq3ewqqRHqxbHez4J.jpg)
AP Cabinet Meeting
AP Cabinet Meeting : ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగనుంది. బుధవారం ఉదయం 11. 00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
అమరావతి భూసేకరణ, జీఏడీ టవర్ టెండర్లు, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, కూటమి ఏడాది పాలనపై ప్రధానంగా చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం రెండో దశకు అవసరమైన 44 వేల ఎకరాల భూసేకరణ అంశంపై ముఖ్యమైన చర్చ జరగనుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు, హెచ్వోడీ భవనాల 4 టవర్లకు, అమరావతిలో 5 వేల ఎకరాల్లో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా రాష్ర్టంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈ పాలన విషయంలో మరిన్ని సంస్కరణలకు గాను పాలనపై ప్రత్యేక చర్చ జరగనుంది. మరో వైపు జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read: ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్
అమరావతిలో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంపెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి గాను 5 వేల ఎకరాలను సేకరించి వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి అమోదం తెలపనుంది. ఇక తల్లికి వందనంపై కేబినెట్లో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. జూన్ 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చిస్తారు. ఇంకోవైపు 48వ సీఆర్డీఏ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
మంత్రివర్గంలో మార్పులు ?
అమరావతి అభివృద్ధితో పాటు మంత్రి వర్గ విస్తరణ మార్పులపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంద్ర, రాయలసీమకు చెందిన కొంతమంది నేతలను మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఈ నెల12తో యేడాది పూర్తి కాబోతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం క్యాబినెట్లో మొత్తం 25 మంత్రి పోస్టులకు గానూ.. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. కానీ కూటమిలో చాలామంది నేతలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతమున్న నేతల్లో కొందరు నేతలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఉత్తరంధ్రాతో పాటు.. రాయలసీమ నుంచి ఒక్కొక్కరికి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. దీంతో ప్రస్తుతమున్న మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.
ఇది కూడా చదవండి: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్ను పాడు చేస్తుందా?
ఒకవేళ ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణపై చర్చ సాగితే టీడీపీలో కొందరు సీనియర్లకు మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం ఉంది. అటు జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుకు మంత్రి పదవి ఇవ్వొచ్చని గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఉన్నదే ఒక్క పోస్టు కాబట్టి.. మంత్రివర్గంలో సరిగ్గా పనిచేయని నేతలకు ఉద్వాసన పలుకుతారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఎవరి మంత్రి పదవులకు ఎసరు పెడుతారోనన్న టెన్షన్ నేతల్లో ఉంది.
Also Read: సెక్స్ వర్కర్లలో తెలుగు స్టేట్స్ టాప్.. HIV కేసుల్లో ఇండియా నెం3!
Also Read : మరో పాకిస్థానీ స్పై అరెస్ట్.. ఎక్కడంటే...