AP Cabinet : ముగిసిన ఎపీ క్యాబినెట్..42 అంశాలకు ఆమోదం ...బనకచర్లపై కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలో నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చ సాగింది.

New Update
ap cabinet

ap cabinet Photograph: (ap cabinet)

AP Cabinet :  ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలో నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో  ఏర్పాటు చేయనున్న కాగ్నిజెంట్ కు సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా  కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99పైసలకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది. రూ.1582.98 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న కాగ్నిజెంట్‌ 8వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని మంత్రి వర్గం వివరించింది. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీడ్ యాక్సెస్ రోడ్ ను నేషనల్ హైవే – 16 కు కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పిలిచెందుకు క్యాబినెట్ ఆమోదించింది. 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  సీఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వం భూములు 2019కు ముందు ఆరేళ్లు అనుభవ దారు ఎవరు ఉంటారో వారికే నష్ట పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లా స్థాయిలో ఏడాది పాలనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమావేశం పెట్టాలని కోరారు.

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

రాజధాని అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.882.47 కోట్లతో జీఏడీ టవర్‌, రూ.1487.11 కోట్లతో హెచ్‌ఓడీ కార్యాలయాలు, రూ.1303.85కోట్లతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు క్యాబినెట్ అనుమతులు మంజూరు చేసింది. అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు మైనేని సాకేత్‌ సాయికి స్పోర్ట్స్‌ కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం కల్పించే అంశంపై మంత్రివర్గంలో చర్చ సాగింది. కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి 51 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎంచంద్రబాబు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్‌లోనే ప్రవేశించి కొంటున్నామని స్పష్ట చేశారు. పొగాకుకు మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో రూ. 250 కోట్లు మనం మార్కెట్‌లో ప్రవేశించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

బనకచర్చ పై ప్రత్యేక చర్చ


ఇక మంత్రి వర్గ సమావేశంలో పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చ సాగింది.  ఈ విషయమై చంద్రబాబు మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని చంద్రబాబు మంత్రులు, ఇతర నేతలకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలను మాత్రమే వాడుకోనున్నట్లు ఆయన వివరించారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ వాటిల్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు.  వరద జలాలను మాత్రమే ఏపీ వాడుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. వరద జలాలను తెలంగాణ కూడా వాడుకోవచ్చని ఏపీకి అభ్యంతరం లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.

ఇది కూడా చూడండి:  Vivo T4 Ultra Offers: వివో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. T4 Ultra మొబైల్‌పై భారీ డిస్కౌంట్లు - కెమెరా హైలైట్!

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు నిర్మించారని, వాటికి ఏపీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఏపీ నేతలంతా మాట్లాడాలని కోరారు. కేవలం రాజకీయాల  కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉంది.’’ అని చంద్రబాబు కోరారు.

అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎంచంద్రబాబు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్‌లోనే ప్రవేశించి కొంటున్నామని స్పష్ట చేశారు. పొగాకుకు మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో రూ. 250 కోట్లు మనం మార్కెట్‌లో ప్రవేశించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు