RCB vs PBKS : కృనాల్ దెబ్బ.. కష్టాల్లో పంజాబ్ .. 4 కీలక వికెట్లు డౌన్
ఆర్సీబీతో జరగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఏకంగా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లకు 98 పరుగలకు 4 కీలక వికెట్లను చేజార్చుకుంది.
ఆర్సీబీతో జరగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఏకంగా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లకు 98 పరుగలకు 4 కీలక వికెట్లను చేజార్చుకుంది.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ లో ప్రసత్తుం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. మొదట లేకపోయినా ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది. వరుసగా రెండు వికెట్లను తీసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ తో ఆర్సీబీ గెలుస్తుందా లేదా చూడాల్సి ఉంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వచ్చారు. తన భార్యతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షా పక్కనే వాళ్లు కూర్చోని మ్యాచ్ వీక్షిస్తున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి వరుసగా రెండు బిగ్ షాకులు తగిలాయి. ఆర్సీబీ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (16), మయాంక్ అగర్వాల్ (24) పరుగులకే ఔటయ్యారు.