India-Pakistan Match In 2026: పాక్ ఆడకుంటే రూ.4,500 కోట్లు నష్టం.. పాకిస్థాన్ నిర్ణయంతో ICCకి షాక్!

పాకిస్థాన్ ప్రభుత్వం 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు రూ. 4,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
India pak

అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే టీ20 ప్రపంచకప్‌(t20-world-cup) లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) యోచిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించడం, అలాగే తటస్థ వేదికల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పాక్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలతో BCCI గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌తో ఆడటం లేదు. కేవలం ICC టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే, పాక్ వేదికగా జరగాల్సిన టోర్నీలను భారత్ వ్యతిరేకించడం లేదా తటస్థ వేదికలకు మార్చాలని ఒత్తిడి తీసుకురావడంతో పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. "భారత్ మాతో ఆడకపోతే, మేము కూడా భారత్‌తో ఆడబోము" అనే మొండి వైఖరిని పాక్ చూపిస్తోంది.

క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్(india-pakistan-matches) అంటే కేవలం ఆట మాత్రమే కాదు. అదొక భారీ బిజినెస్ డీల్. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ICC, బ్రాడ్‌కాస్టర్లకు నిద్ర లేకుండా చేసింది. ఈ ఒక్క మ్యాచ్ విలువ సుమారు రూ.4,500 కోట్లుగా లెక్కగట్టారు. 

Also Read :  ఫామ్‌హౌస్‌లో పనిమనిషిపై లైంగిక దాడి.. పాక్ మాజీ క్రికెటర్ కొడుకు ఎంతకు తెగించాడంటే?

ఐసీసీ వార్నింగ్

పాక్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఘాటుగా స్పందించింది. వరల్డ్ కప్(2026 T20 World Cup) వంటి మెగా టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్ అంటే అత్యధిక ఆదాయం వచ్చే ఈవెంట్. ఒకవేళ పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. టోర్నీ మధ్యలో వైదొలిగితే పీసీబీకి అందే నిధుల్లో భారీగా కోత విధిస్తారు. మ్యాచ్ ఆడకపోతే టీమిండియా(team-india) కు వాకోవర్ పాయింట్లు లభిస్తాయి. ఇది పాక్ సెమీస్ అవకాశాలను దెబ్బతీస్తుంది. క్రీడల్లో రాజకీయాలను చొప్పించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కాబట్టి, పాక్ జట్టుపై తాత్కాలిక నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.

భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులు నిరాశ చెందుతారు. దీనివల్ల బ్రాడ్‌కాస్టర్లకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని పీసీబీ నుంచే వసూలు చేసేలా నిబంధనలు రూపొందించాలని ఐసీసీ భావిస్తోంది. ప్రస్తుతానికి పాక్ ప్రభుత్వం మరియు పీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. క్రీడా స్ఫూర్తిని చాటుతారా లేక పంతానికే పోతారా అనేది వేచి చూడాలి. క్రికెట్ అభిమానులు మాత్రం ఈ మెగా ఫైట్ జరగాలని కోరుకుంటున్నారు.

Also Read :  BCB: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్.. రీప్లేస్ వీలు కాదని తేల్చి చెప్పిన ఐసీసీ

Advertisment
తాజా కథనాలు